Site icon pvginox

ఎందరో మహానుభావుల త్యాగఫలితమే నేటి స్వాతంత్య్రం.. ఎమ్మెల్సీ పిడుగు.హరిప్రసాద్

Spread the love

(pvginox.com By PALLA VENUGOPAL )

భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ వేడుకలో పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించి, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది అంటే కారణం శ్రీ సుభాష్ చంద్రబోస్, శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్, శ్రీ భగత్ సింగ్ లాంటి మహానుభావుల త్యాగాలే. వాళ్లు ఆనాడు చేసిన రక్త తర్పణం ఫలితమే ఈ రోజు మనం సాధించిన ప్రగతికి కారణం.

Exit mobile version