Site icon pvginox

వై సి పి ది పాకిస్థాన్ టీమ్… కూటమిది టీమ్ ఇండియా

Spread the love

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసన సభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు మీడియా సమావేశం పాయింట్స్…

• కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తుంటే.. ప్రభుత్వానికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు 151 సీట్లు ఇస్తే పాలన చేతకాక ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేసిన జగన్ అండ్ కో నాడు చేసిన తప్పులకు నేడు కర్మ అనుభవిస్తున్నారు. ప్రజల తీర్పుని గౌరవించకుండా మతిభ్రమించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
• వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరాయంగా పని చేస్తున్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే మీరు చేయాల్సింది వర్క్ ఫ్రం బెంగళూరు కాదు.. మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మీరెంతో మేమూ అంతే.
• ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మెజారిటీ ఎలా కావాలో.. ప్రతిపక్ష నేత అవ్వాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

Exit mobile version