
(05-06-2025, విజయవాడ, pvginox )
(PALLA VENUGOPAL.. 9866277029)
అంగన్వాడీ సెంటర్ల అభివృద్దకి కృషి చేస్తాను : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
అంగన్వాడి సెంటర్లకు పూర్వ వైభవం తీసుకురావడం కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి గుమ్మిడి సంద్యారాణి
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ కార్యక్రమం
రాష్ట్రం మొత్తంగా ఉన్న 55607 అంగన్వాడి సెంటర్లు
మొదటి దశలో 11, 400 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు అందజేత
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
అంగన్వాడీ టీచర్లకు ఇండక్షన్ స్టవ్ లు అందించిన మంత్రి గుమ్మడి సంధ్య రాణి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కృషి చేస్తున్నాను. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ను కలిసి లెటర్ అందించటం జరిగిందని…అంగన్వాడీ కేంద్రాల సమస్యల త్వరలో పరిష్కారం అవుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ. ఈ.ఎస్. ఎస్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మహిళల అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఫన్ టైమ్ లో అంగన్వాడి టీచర్లతో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి మహిళల అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి, ఎంపీ .కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , ఈఈఎస్ఎల్(Energy Efficiency Service Ltd) సీ.ఈ.వో విశాల్ కపూర్ హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లకు ఇండక్షన్ స్టవ్ లు మంత్రి గుమ్మడి సంధ్య రాణి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందించారు. ఈ కార్యక్రమానికి ముందు ఫన్ టైమ్ క్లబ్ లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈకార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా వుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒక కోటి మొక్కలను నాటాలనే సంకల్పంతో వున్నారని, ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ ను తయారుచేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశ్యం అన్నారు.
అంగన్ వాడీ టీచర్ల కు పని ఒత్తిడి, సమయం తగ్గించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55607 అంగన్వాడి సెంటర్లకు గాను మొదటి దశగా 11400 అంగన్వాడి సెంటర్లకు ఇండక్షన్ స్టవ్ ల పంపిణి చేయనున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న ముగ్గురు మహిళామంత్రులు ప్రజలకు చేస్తున్న సేవలు హర్షనీయం అన్నారు. .
అంగన్వాడి టీచర్లు అందించే సేవలు చిన్నారుల భవిష్యత్తు కొరకు ఇచ్చే శిక్షణ చాల గొప్పదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మొత్తం 1457 అంగన్వాడి సెంటర్లలో 553 శాశ్వత భవనాలలో 226 సెంటర్లకు కాంపౌండ్ వాల్ కొరకు మరియు అదనంగా 60 అంగన్వాడి సెంటర్ల నిర్వహణ కొరకు కేంద్రాన్ని అనుమతి కోరారని తెలిపారు. అంతే కాకుండా అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ టీచర్లకు ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి అండగా ఉంటానని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో భాగంగా 25మంది గర్బిని స్త్రీలకు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి తో కలిసి సాముహిక సీమాంతాన్ని నిర్వహించి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆశీర్వాదాలు అందచేసారు. అంగన్వాడి టీచర్లకు 10 మందికి ఇండక్షన్ స్టవ్ తో పాటు నాలుగు రకాల కాంటైనేర్లను అందించడం జరిగింది.కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలువురు అతిధులకు మరియు అధికారులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను బహూకరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి ఐఏఎస్ , ఈఈఎస్ఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్, సీజీఎం అనిమేష్ మిశ్రా, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్ లతో పాటు సంబంధిత అధికారులు, అంగన్వాడి టీచర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు.