
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. పార్టీ నేతలు శ్రీ సామినేని ఉదయ భాను, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్, శ్రీ అక్కల గాంధీ, శ్రీమతి రావి సౌజన్య, శ్రీమతి మల్లెపు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.