Uncategorized

రూ. 500 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.. ఎంపీ కేశినేని చిన్ని

Spread the love

( 05-06-2025, విజయవాడ, pvginox )

(PALLA VENUGOPAL, 9866277029)

విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ అభివృద్ధికి రూ.850 కోట్లు…నీతి ఆయోగ్ ఆమోదం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

4వ డివిజన్‌లో రూ.70 లక్షల వ్యయంతో ప‌లు రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాప‌న‌

శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

త్వరలో ఆటోనగర్‌కు నీళ్ళు అందిస్తామ‌న్న ఎమ్మెల్యే గద్దె

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ ను పిపిపి విధానంలో అభివృద్ది చేసేందుకు రూ.850 కోట్లను మంజూరు చేయడానికి నీతిఆయోగ్‌ ఆమోదం తెలిపింది. మూడు సంవత్సరాల్లో రైల్వేస్టేషన్‌ను పూర్తి స్థాయిలో ఆధునీక‌రణ ప‌ద్ద‌తిలో అభివృద్థి చేస్తామని, వచ్చే నెలలోనే రైల్వే స్టేషన్‌ అభివృద్థికి టెండర్లు పిలుస్తారని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీలోని సుమారు రూ.70 లక్షల అంచానా వ్యయంతో చేపట్టిన వివిధ రోడ్ల నిర్మాణ పనులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కలిసి శంకుస్థాపన చేశారు.

ఈసంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని కాలనీలను అభివృద్థి చేయడం చాలా ఆనందంగా వుందన్నారు.అలాగే విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ లో జ‌ర‌గ‌బోయే ఆధునీక‌ర‌ణ ప‌నులు గురించి వివ‌రించారు. నీతిఆయోగ్ నుంచి నిధులు రాబ‌ట్టేందుకు విశేష కృషి చేసిన ముఖ్య‌మంత్రి చంద్రబాబుకి, స‌హ‌క‌రించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అడుగుజాడల్లో న‌డుస్తూ ప్ర‌తినిత్యం ప్ర‌జ‌ల చెంత‌నే వుంటూ వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జాసేవ చేయ‌టంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను తాను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నానని ఎంపీ కేశినేని శివనాథ్‌ చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మట్లాడుతూ విజయవాడ అంటే రాష్ట్ర రాజధాని నగరం అని అన్నారు. రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి రూ.850 కోట్లు మంజూరు చేయించడం అంటే ఎంపీ కేశినేని శివనాథ్‌ను అభినందించాల్సిన విషయన్నారు. ఆటోనగర్‌కు నీళ్ళు ఇచ్చేందుకు కూడా ఎంపీ కేశినేని శివనాథ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని త్వరలోనే ఆటోనగర్‌ వాసులు శుభవార్తను వింటారని చెప్పారు. మంచినీటి ధార మాదిరిగా విజయవాడ అభివృద్థికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిధులను విడుదల చేస్తున్నారని చెప్పారు. విజయవాడ నగర అభివృద్థికి డీపీఆర్‌ రూపోందించి ఇస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాయంలో విజయవాడ నగరంలో ఎన్నో అభివృద్థి పనులు చేపట్టామన్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అభివృద్థి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్థి పనులకు శంకుస్థాపనలు చేయడానికి తమకు సమయం లేనంత సంఖ్యలో కూటమి ప్రభుత్వ హాయంలో అభివృద్థి పనులు చేస్తున్నామని అన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో విజయవాడ నగర అభివృద్థికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని చెప్పారు. విజయవాడ నగర అభివృద్థికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నానని అసెంబ్లీలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేశారే కాని ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. విజయవాడ నగరాన్ని అభివృద్థి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే అధిక సంఖ్యలో నిధులు మంజూరు చేశారని, మరిన్ని నిధులను మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. విజయవాడ నగరంలో అన్ని సమస్యలను పరిష్కరించి,ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి విజయవాడ నగరం రుణాన్ని తాము తీర్చుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు,, కార్పొరేటర్ మమ్మనేని ప్రసాద్,4వ డివిజన్ ప్రెసిడెంట్ గొల్లపూడి నాగేశ్వరరావు, టిడిపి నాయకులు యేర్నేని వేదవ్యాస్,కోడూరు ఆంజనేయవాసు, చినుముల సురేష్, వెంకటేశ్వరరావు, బొప్పన రామమోహన్‌రావు, సజ్జ బాబూరావు, మండవ వెంకటేశ్వరరావు, అనంత పద్మనాభ మూర్తి, కార్పోరేషన్‌ ఈఈ సామ్రాజ్యం, ఏఈ దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *