Uncategorized

ఆటలు సాగవు.. సీఎం చంద్రబాబు

Spread the love

‘ఖబడ్దార్‌ నా దగ్గర ఎవరి ఆటలు సాగవు’ : చంద్రబాబు

43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమన్న చంద్రబాబు*

మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగుగడ్డపైనే పుడతానని వ్యాఖ్య

కడపలో మహానాడు రెండోరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. మహానాడు తొలిరోజు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రజలకు మేలుచేసేలా చర్చలు సాగాయని వివరించారు. తెలుగుజాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు జయంతి అంటే తెలుగుజాతికి పండగరోజని తెలిపారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. తెలుగు సినీచరిత్రలో ఎవరెస్ట్​గా ఆయన ఎదిగారని వివరించారు. నీతి నిజాయతీ, పట్టుదల ఎన్టీఆర్‌ ఆయుధాలని తెలియజేశారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నేతని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు : నందమూరి తారక రామారావు 33 సంవత్సరాలు వెండితెరకు 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్‌ అంటే పేదవాడికి భరోసా రైతులకు నేస్తం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. అధికారమంటే బాధ్యత పదవి అంటే సేవ అని నిరూపించారు. పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చారు. ఆయన రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజలకు నందమూరి తారక రామారావు గుర్తుంటారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా టీడీపీ జెండా. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త ఒరవడి సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

తెలుగుజాతిని 2047కు ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంచాలి. రాబోయే 40 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌నకు రూపకల్పన చేసుకున్నాం. నా తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు చేసుకున్నాం. మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగుగడ్డపైనే పుడతా. కార్యకర్తే అధినేత శ్రేణులే సుప్రీం ఇది పార్టీ సిద్ధాంతం. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వం తీసుకొచ్చాం. అతి చిన్న వయస్సులో కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్‌నాయుడు ఉన్నారని’ చంద్రబాబు పేర్కొన్నారు.తెలుగుదేశం కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు వివరించారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమని తెలిపారు. శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజలకు దగ్గరగా కార్యకర్తలు ఉండాలన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు వెల్లడించారు.

వివేకా హత్యకేసు విషయంలో నాలాంటి నాయకుణ్నే మోసం చేయగలిగారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేశారు. అందరిలా నేనూ నమ్మా. సాయంత్రానికి గొడ్డలిపోటు విషయం బయటికి వచ్చింది. నాపై నెపం వేసేందుకు దుష్ప్రచారాలు చేశారు. రాజకీయాల్లో కరడుగట్టిన నేరస్థులను ఎదుర్కొంటున్నాం. కోవర్టులుగా ఉంటూ ఇష్టారీతిలో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేరస్థులూ ఖబడ్దార్‌ తన దగ్గర ఎవరి ఆటలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. కోవర్టులను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవని చెప్పారు. వలస పక్షులు వస్తాయి పోతాయన్నారు. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని తెలిపారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నట్లు పేర్కొన్నారు. నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ‘సోషల్‌ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. ఆడబిడ్డలపై ఆసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరిరోజు అవుతుంది. రాజకీయంగా, ఆర్థికంగా నా ఆడబిడ్డలు మగబిడ్డలతో సమానంగా ఉండాలి. అన్నదాతగా అండగా ఉంటూ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పోలవరం పూర్తిచేస్తాం. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. యువశక్తి నిర్వీర్యం కావడానికి వీల్లేదని’ చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *