Uncategorized

పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

Spread the love

సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
• కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది
• అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం

  • పిఠాపురంలో 9 నెలల్లోనే రూ. 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం
    • పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత
  • శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు
    • పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో కలిసి ముందుకు సాగుతామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పిఠాపురం ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించే పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పిఠాపురంలో 9 నెలల్లోనే రూ.100 కోట్లపైగా అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం ప్రజల కోరిక మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చే నిమిత్తం తొమ్మిది నెలల్లోనే రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. అదే విధంగా నూతనంగా రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషీన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆసుపత్రిలో నూతనంగా డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పెథాలజీ విభాగాలు ఏర్పాటు చేసి అందుకు సంబంధించి 66 కొత్త పోస్టులు మంజూరు చేశాం. ఈ ఆసుపత్రి ద్వారా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు చుట్టు పక్కల ఆరు మండలాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొనే ప్రభుత్వం. గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు, నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకొనేందుకు వీలుగా రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టిటిడి కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశాము. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ కళ్యాణ మండపం ద్వారా చుట్టు పక్కల గ్రామాలలో సుమారు పది వేల కుటుంబాలకు అతి తక్కువ రుసుముతో వివాహాది శుభకార్యాలు చేసుకునే సౌకర్యం లభిస్తుంది.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేబ్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా రూ. 48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి రూ . 1 కోటి 32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
• ఉచిత టార్పాలిన్లతో రైతులకు అండ
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, కాపు వర్గాల్లోని ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల ఆర్ధాకాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక కుట్టు మిషన్ల శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. శిక్షణకు ఎంపికైన వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నాం. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మంది మహిళలకు రూ. 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లను ఈ రోజు పంపిణీ చేశాం. అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను ఆదుకునేందుకు, పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చిన్న, సన్నకారు రైతుల ధాన్యాన్ని రక్షించేందుకు రూ. 26 లక్షల వ్యయంతో 2 వేల టార్పాలిన్లు రైతులకు ఉచితంగా అందజేశాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గo పరిధిలోని రైతులకు రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను పంపిణీ చేశాం. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 25 వేల ఎకరాల్లో రైతులకు మేలు చేకూరుతుంది.
• ఉపాధి పనుల ద్వారా 5 వేల మంది శ్రామికులకు ఉపాధి
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉపాది హామీ పథకం ద్వారా రూ.18.02 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సిమెంటు రోడ్లు, రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, రూ. 8.68 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 431 గోకులాలను నేడు ప్రారంభించాము. ఈ పనుల ద్వారా సుమారు 5000 మంది ఉపాధి శ్రామికులకు పని అందించాం. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సుమారు 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేశాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన రూ. 21.58 కోట్ల విలువైన రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేస్తాము. ఈ పనుల ద్వారా 12 గ్రామాలకు ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. గౌరవప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలకి నిధులను సమకూర్చడం వల్ల ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేయగలుగుతున్నాము.

  • రైల్వే వంతెన నిర్మాణం కూడా కేంద్ర సహకారంతో త్వరలో పూర్తి చేస్తాం
    పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యచెరువు ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఆ ప్రాంతంలో మంచినీటి వెతలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పారిశుధ్యం, డ్రైన్లు, మురుగు నీటి నిర్వహణ పనులకు చేపట్టనున్నాము. పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత త్రాగు నీటి సరఫరా, రోడ్లు, డైయిన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీ కి రూ.3 కోట్లు, గొల్లప్రోలు నగర పంచాయతీకి కోటి రూపాయిల నిధులు మంజూరు చేశాం. నేడు శ్రీకారం చుట్టిన రూ. 100 కోట్ల విలువగల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని రెండు లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుంది. సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం. పిఠాపురం రైల్వే వంతెన నిర్మాణం పిఠాపురం ప్రజల చిరకాల కోరిక. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది” అన్నారు.
    • రూ. 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్ల పంపిణీ
    అంతకు ముందు పిఠాపురం నియోజకవర్గం స్థానిక అంబేడ్కర్ భవన్ లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ , శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 3,456 మంది మహిళలకు రూ.8.64 కోట్లు విలువైన కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 1.46 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులకు సబ్సిడీ ద్వారా పంపిణీ చేసిన యంత్రాల్లో డ్రోన్లు, పవర్ టిల్లర్లు, టార్పలిన్లు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు ఇందులో ఉన్నాయి.
  • ఉప్పాడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపానికి, ఆలయ పనులకు శంకుస్థాపన
    పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో నూతనంగా రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న టిటిడి కళ్యాణమండపానికి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుగా టిటిడి నూతన కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు గొల్లప్రోలులో రూ. 1.32 కోట్లతో నిర్మించ తలపెట్టిన శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాకార మండపానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసి, పూజలు చేశారు. అలాగే చేబ్రోలు లో శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 48 లక్షలతో రథశాల, కాలక్షేప మండప నిర్మాణానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన గావించారు. కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం ఎకరా స్థలాన్ని విరాళంగా అందించిన విశ్రాంత ఉద్యోగి డాక్టర్ సాంబశివరావు గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించి, సత్కరించారు. అందరికీ ఉపయోగపడే పని నిమిత్తం విలువైన స్థలాన్ని విరాళంగా అందించడం గొప్ప వ్యక్తిత్వమని డాక్టర్ సాంబశివరావు గారిని ఆయనను అభినందించారు. అనంతరం అక్కడే పలు వినతులు తీసుకొని, నాయకులతో మాట్లాడారు.
  • స్నేహిత్, నేహాంజనిలకు అభినందనలు
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 94వ ర్యాంకు సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన శ్రీ చెక్కా స్నేహిత్, ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకుగాను 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించిన కాకినాడ విద్యార్థిని యాళ్ళ నేహాంజని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురిని అభినందించారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న కళ్యాణమండపము శంకుస్థాపనకు సంబంధించిన బ్రోచర్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు.
    ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ పెండెం దొరబాబు, శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ మీనా, ఎస్పీ శ్రీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *