(అమరావతి, 31/1/2025,pvginox.com)
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ…

పొలిట్ బ్యూరో సమావేశంలో సుమారు నాలుగున్నర గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనిఫెస్టో చదవడం, చదివించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చ జరిగింది. మేనిఫెస్టో అమలు మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. టీడీపీ సభ్యత్వాలు విజయవంతంగా జరిగాయి. ఊహించని విధంగా మెంబర్షిప్ లు జరిగాయి. టీడీపీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోటే ఎన్నికల్లో గెలగలిగాం. ఏపీలో సుమారు రాష్ట్రంతోపాటు అలాగే తెలంగాణలో, అండమాన్ లో మొత్తంగా మూడు ప్రాంతాల్లో కోటి రెండు లక్షల 17 మెంబర్షిప్లు పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ టైం కోటి మెంబర్షిప్లు చేసుకోవడం జరిగింది. దీంతో మేము ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం. దాని ప్రకారం ముందుకెళతాం. క్లష్టర్, యూనిట్ బూత్ ఇలా విభజించుకుంటూ పోతాం. దీంతో కింది స్థాయి నుంచి పార్టీ బలపడడానికి అవకాశం ఉంది. ప్రతి ఇంటికొక తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఉండేలా చూడాలని నిర్ణయించుకున్నాం. కుటుంబ సాధికారత సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.