
రాష్ట్ర సమాచార కమిషన్ విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్
విజయవాడ, సెప్టెంబర్ 8:pvginox.com
రాష్ట్ర సమాచార కమిషన్ రెండవ అప్పీళ్లు మరియు ఫిర్యాదుల విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ సోమవారం రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, రాష్ట్ర సమాచార కమిషన్ విచారణల ప్రత్యక్ష ప్రసారం కమిషన్ పనితీరులో మరింత పారదర్శకంగా నిర్వహించడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ కృషిని అభినందించారు.
కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ హీరాలాల్ సమారియా, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రాష్ట్ర సమన్వయకర్త మరియు శాస్త్రవేత్త-జి డాక్టర్ ఆర్.కె. పాఠక్, గవర్నర్ ఇ.ఓ. కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్లాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ ఆర్. మహబూబ్ బాషా ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొన్నారు.
